ఆ దుస్తులు ధరిస్తున్నాం.. ఆర్థిక మాంద్యం ఎక్కడుంది: బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్

  • దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది
  • దేశంలో చాలామంది సూట్లు, ప్యాంట్లు ధరిస్తున్నారు
  • పరిస్థితి బాగా లేకుంటే..ధోవతీలు, కుర్తాలు ధరించేవారు
దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని అందరూ అనుకుంటున్నారని, కానీ, అది నిజం కాదని బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్ అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందంటూ సరికొత్త సూచికను వెల్లడించారు. యూపీలో ఓ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రపంచ దేశాల్లో ఆర్థిక తిరోగమనం గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయని, నిజంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బలహీనంగా మారివుంటే తామంతా కుర్తాలు, ధోవతీలు ధరించి ఈ సమావేశానికి వచ్చి ఉండేవారమన్నారు.

దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని ఎలా చెప్పగలరు? అంటూ ప్రశ్నిస్తూ, దేశంలో చాలామంది జాకెట్, సూట్లు ధరిస్తున్నారన్నారు. వాటితో పోలిస్తే తక్కువ ధరకు లభించే సంప్రదాయ ధోవతీలు, కుర్తాలు ఎందుకు ధరించడంలేదో చెప్పాలన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉందనడానికి చిహ్నమని తాను పక్కగా చెబుతున్నానన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మంచి సూట్లు, ప్యాంట్లు, పైజామాలు ధరించేవారం కాదని ఎంపీ చెప్పారు.
Go Back to Shorts
Dressing
Indian Economy
BJP
MP Veerendhra Singh
Uttar Pradesh

More Telugu News